NTV Telugu Site icon

ఎంఐఎం దొంగలను పాకిస్తాన్ కు పంపిస్తాం : రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే ఎంఐఎం దొంగలను పాకిస్తాన్ కు పంపిస్తామని హెచ్చరించారు రాజా సింగ్‌. మోడీ దెబ్బకు జనగణమన పాడుతున్నారని తెలిపారు. ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ కి ఎంఐఎం పార్టీ వత్తాసు పలికుతుందని ఫైర్‌ అయ్యారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనేనని… ఏమి చేస్తారో ఇప్పుడే ఆలోచించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఛార్మినార్ దగ్గర సభ పెట్టామన్న రాజా సింగ్‌…ఎవరూ ఏమీ పీకలేదని తెలిపారు. మీకు రోజులు దగ్గర పడ్డాయని ఎంఐఎం కు వార్నింగ్‌ ఇచ్చారు రాజా సింగ్‌. అటు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ నేనని తెలిపారు.