Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
READ ALSO: Best Bikes: లీటరుకు 70KM మైలేజ్.. రూ. 70,000 కంటే తక్కువ ధర.. ఈ బైక్స్ పైనే అందరి ఫోకస్
తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ పంపిణీ సంస్థ ‘ఫార్స్ ఫిలిమ్స్’ ‘వారణాసి’ చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించినట్లు టాక్ నడుస్తుంది. ఈ స్థాయి ధర పలకడం ఒక రికార్డ్గా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజం అయితే జక్కన్న – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోందని అంటున్నారు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ, మహేష్ బాబు స్టార్డమ్ తోడవ్వడంతో ఓవర్సీస్ ధర ఈ రేంజ్లో పలుకుతుందని చెబుతున్నారు. కేవలం ఓవర్సీస్ రైట్స్ రూ.160 కోట్లు పలుకుతుంటే, థియేట్రికల్, శాటిలైట్ హక్కులు ఇంకెన్ని రికార్డులను కొళ్లగొడుతాయో అని బాబు ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Gaddar Awards 2025: ‘తండేల్’కు డబుల్ ధమాకా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య!
