మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రితేష్ దేశ్ముఖ్ సిద్ధమయ్యారు. జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘రాజా శివాజీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాజా శివాజీ ఆంథమ్’ విడుదలైంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ సాంగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Also Read : Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!
ప్రముఖ గాయకుడు అజయ్ గోగవాలే తన గంభీరమైన గళంతో ఈ పాటను ఆలపించారు. శివాజీ మహారాజ్ శౌర్యాన్ని, పరాక్రమాన్ని కీర్తిస్తూ సాగే ఈ ఆంథమ్ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అజయ్-అతుల్ అందించిన సంగీతం ఈ పాటకు ఆత్మలా నిలిచింది. పీరియాడిక్ డ్రామా కావడంతో విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా రితేష్ దేశ్ముఖ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. మరాఠీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో శివాజీ మహారాజ్ కథను ఇంత గొప్పగా చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
