తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 15 తర్వాత పశ్చిమ మధ్య-వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగస్టు 15 నాటికి బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడుతుందని, అది బలపడి 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వివరించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో, ఇటు హైదరాబాద్ ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.
అలెర్ట్ : మూడు రోజుల పాటు వర్షాలు
