Rahul Gandhi: రేపు హత్రాస్‌లో రాహుల్ పర్యటన.. బాధిత కుటుంబాలను పరామర్శించనున్న అగ్రనేత

  • రోడ్డు మార్గంలో వెళ్లనున్న రాహుల్ గాంధీ
  • బాధితులకు పరామర్శ
Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం హత్రాస్‌కు వెళ్లనున్నారు. హత్రాస్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. కాంగ్రెస్‌ నేతలు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా హత్రాస్‌లో ఒక మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనలో, స్వయం ప్రకటిత దేవుడు ‘భోలే బాబా’ అలియాస్ నారాయణ్ సకర్ హరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఈ ఘటనలో ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించిన ఆరుగురిని
ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల అంతర్గత విచారణ నివేదిక నిర్వహణ, భద్రతా ప్రోటోకాల్‌లలో తీవ్రమైన లోపాలను వెల్లడించింది.

READ MORE: Amla: వానాకాలంలో ఉసిరితో ఎన్ని లాభాలో..!

హత్రాస్ ప్రమాదంపై విలేకరుల సమావేశంలో ఐజి శలభ్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్‌పై లక్ష రూపాయల రివార్డు ఉంచినట్లు తెలిపారు. త్వరలో అతడిపై కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నారు. అవసరమైతే భోలే బాబాను విచారిస్తామని ఐజీ తెలిపారు. బాబా పాత్ర వెలుగులోకి వస్తే అతడిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన అధికారులు భోలే బాబా ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భోలే బాబా ఆశ్రమం 13 ఎకరాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆశ్రమం ఫైవ్ స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్నట్లు తెలిసింది. భోలే బాబా అని పిలవబడే నారాయణ్ సాకర్ హరి మెయిన్‌పురి బిచ్వాలో కోట్ల విలువైన విలాసవంతమైన ఆశ్రమంలో నివసించారు. ‘ప్రవాస్ ఆశ్రమం’ అని పిలవబడే ఈ భవనం అలీఘర్-గుజరాత్‌ రహదారిపై 13 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ విలాసవంతమైన భవనంలో అన్ని ఫైవ్-స్టార్ సౌకర్యాలతో పాటు బాబాకు చెందిన లగ్జరీ కార్లను ఉంచడానికి పెద్ద గ్యారేజీ ఉంది. విలాసవంతమైన కార్ల సముదాయాన్ని ఉంచడానికి భారీ గ్యారేజీ ఉంది. ఈ విలాసవంతమైన ఆశ్రమంలో బాబా కోసం ప్రత్యేకంగా ఆరు గదులను కేటాయించినట్లు వెల్లడైంది.