Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం అలీఘర్, హత్రాస్లో పర్యటించారు. ఇక్కడికి చేరుకున్న ఆయన హత్రాస్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. హత్రాస్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హత్రాస్ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. హత్రాస్ ప్రమాదం చాలా బాధాకరమని రాహుల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందజేయాలన్నారు. ఈ ప్రమాదం వల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయని రాహుల్ అన్నారు. చాలా మంది చనిపోయారు. దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయకూడదనుకుంటున్నాను కానీ పరిపాలన లోపించి తప్పులు దొర్లాయని నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
Read Also:Milk Price In Pakistan: పాక్లో దడ పుట్టిస్తున్న పాల ధర.. ప్రజలు ఏం చేశారంటే..?
#WATCH | Hathras, Uttar Pradesh: After meeting the bereaved families of the Hathras Stampede accident, Congress leader and Lok Sabha MP Rahul Gandhi says, "A lot of families have been affected and many people have died… I dont want to politicise this. There have been… pic.twitter.com/dohI2TpGVY
— ANI (@ANI) July 5, 2024
సాధ్యమైనంత త్వరగా నష్టపరిహారం బాధిత కుటుంబాలకు అందజేయాలని యూపీ సీఎంను అభ్యర్థిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా రాహుల్ మాట్లాడారు. బాధితులు ఎవరు, ఏంటి, వారు ఏం చేసేవారు, ఎలా జీవించారు ఇలా ప్రతీది చర్చించారు. పరిపాలన లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉండాల్సిన పోలీసు వ్యవస్థ అక్కడ లేదన్నారు. ఆ ప్రజలు తీవ్ర బాధలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వారి బాధలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నించానన్నారు. అలీఘర్లోని పిల్ఖానా గ్రామంలో హత్రాస్ ప్రమాద బాధితుడు ఛోటే లాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ కలిశారు. తొక్కిసలాటలో చోటాలాల్ భార్య, కొడుకు చనిపోయారు. హత్రాస్లోని గ్రీన్ పార్క్లోని విభవ్ నగర్లో బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ కలిశారు. ఆశాదేవి, మున్నీదేవి, ఓంవతి కుటుంబాలను రాహుల్ కలిశారు. వారిని ఓదార్చారు. తొక్కిసలాటలో మూడు కుటుంబాలకు చెందిన నలుగురు చనిపోయారు.
Read Also:Keir Starmer: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. తదుపరి ప్రధానిగా కీర్ స్టామర్
Uttar Pradesh: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi met the victims of the Hathras stampede, in Aligarh. pic.twitter.com/8h2vh8aijO
— ANI (@ANI) July 5, 2024