Site icon NTV Telugu

Rahul Gandhi : వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ.. సీఈసీ సమావేశంలో ఖరారు

Rahul

Rahul

Rahul Gandhi : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ స్థానం ఖరారు చేశారు. కాంగ్రెస్ తొలి జాబితాలో రాహుల్ గాంధీ పేరు చేరనుంది. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం (మార్చి 7) జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. సీఈసీ సమావేశంలో వివిధ స్క్రీనింగ్ కమిటీలు పంపిన పేర్లలో అభ్యర్థుల పేర్లను ఆమోదించారు.

Read Also:Maha Shivratri Special Shiva Abhishekam: మహాశివరాత్రి రోజున ఈ అభిషేకం వీక్షిస్తే మృత్యుభయం తొలగిపోతుంది

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ నుంచి భూపేష్ బఘేల్, కోర్బా స్థానం నుంచి జ్యోత్స్నా మహంత్‌ల పేర్లను ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఢిల్లీలోని మూడు స్థానాలపై పేర్లు ఖరారు కాలేదు. కమిటీ తదుపరి సమావేశం 11వ తేదీన జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ తొలి జాబితాలో చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్‌, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపూర్‌ స్థానాల్లో పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Read Also:Bhimaa Twitter Review : ‘భీమా’ హిట్ టాక్ అందుకున్నట్లేనా? సినిమా ఎలా ఉందంటే?

తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు సంబంధించి సీఈసీ సమావేశం ముగియగా, మిగిలిన రాష్ట్రాలకు ఇంకా సమావేశం కొనసాగుతోంది. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అమేథీ, వాయనాడ్‌ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అమేథీ స్థానంలో ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ వయనాడ్ సీటును గెలుచుకున్నారు. గత వారం, 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులకు టికెట్లు లభించాయి.

Exit mobile version