Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న (బుధవారం) వాయిదా పడింది. కాగా, సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యాత్రను ఒక్కరోజు నిలిపివేశారు. జైపూర్లో సోనియా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాలుపంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో యాత్ర రద్దైనట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు.
Read Also: Health Tips : నానబెట్టిన పల్లీలను తింటే ఎన్ని లాభాలో తెలుసా?
అయితే, ఇవాళ్టి నుంచి బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని హస్తం పార్టీ ప్రకటించింది. ఔరంగాబాద్లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారు.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఇక, జనవరి 14న మణిపూర్లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్ ప్రకారం 68 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా ప్రయాణిస్తూ మార్చి 20న ముంబైకి చేరుకోవడంతో జోడో న్యాయ యాత్ర ముగుస్తుంది. మధ్య మధ్యలో రాహుల్ బ్రేక్లు తీసుకోవడంతో.. అనుకున్న సమయానికి యాత్రను ముగిస్తారా? లేదంటే పొడిగిస్తారో అనేది వేచి చూడాలి.