Ragi Aaviri Kudumu Recipe: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎముకల బలానికి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి ఒక అద్భుతమైన ఆహారం. మరి ఈ రాగులతో ఎంతో రుచికరమైన, బలవర్ధకమైన “రాగి ఆవిరి కుడుము” ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి – 1 కప్పు
* ఉప్పుడు బియ్యం (లేదా మామూలు బియ్యం) – 1/2 కప్పు
* మినపప్పు – 1/4 కప్పు
* ఉప్పు – రుచికి సరిపడా
* నీళ్లు – తగినన్ని
Ragi Thopa Recipe: సాంప్రదాయ రుచి, కాల్షియం, ఐరన్తో నిండిన ‘రాగి తోపా’.. ఇలా చేసేయండి!
తయారీ విధానం:
మొదటగా మినపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ నానిన పప్పు, బియ్యాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఇడ్లీ పిండిలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు రాగి పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి.
ఇలా ఉన్న మిశ్రమాన్ని కనీసం 7 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల కుడుములు మృదువుగా వస్తాయి. పులిసిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆవిరి కుడుము పాత్రను లేదా ఇడ్లీ పాత్రను తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాయాలి. పాత్రలో పిండిని వేసి, ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. కుడుము ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి తీసుకోవాలి.
ఈ రాగి ఆవిరి కుడుమును వేడివేడిగా అల్లం చట్నీ లేదా వేరుశనగ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది మంచి పోషకాహారం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీనిని ప్రయత్నించి ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి.
