NTV Telugu Site icon

Raghunandan Rao : నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి…

Raghunandan

Raghunandan

మియాపూర్ ఆసుపత్రిలో కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న గో సంరక్షణకుడిని మెదక్ ఎం.పి రఘునందన్ రావు పరామర్శించారు. గోవులను తరలిస్తున్నారని మా గో సంరక్షణకు లు పోలీసులకు సమాచారం ఇస్తే .. మెదక్ టౌన్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని రఘునందన్‌ రావు మండిపడ్డారు. చట్టం తెలియకుండా పోలీసులు మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువు వధ పై చాలా స్పష్టంగా రాష్ట్రాల డీజీపిలకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన అన్నారు. నిన్నటి ఘటనపై పోలీసులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. హిందువులని అరెస్టు చేశారు గో సంరక్షణ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే జరిగే పరిణామాలకు ఎస్పీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. మెదక్ టౌన్ లో 144 సెక్షన్ ఉందని డిజి చెబుతున్నాడని, తను ప్రజల చేత ఎన్నుకున్న ఎంపీని కచ్చితంగా మెదక్ వెళ్తానన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అన్నారు ఎంపీ రఘునందన్ రావు. మీరు భయపడితే భారత రాజ్యాంగానికి ప్రజలకు భయపడాలని, ఉదయం ఐదుగురు సాయంత్రం మరి కొంత హిందువులనే అరెస్ట్ చేశారన్నారు. ఘటనకు బాధ్యులైన ముస్లింలను అరెస్ట్ చేయలేదన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.