Qatar-Iran Conflict 2026: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. బుధవారం ఖతార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఇరాన్కు చెందిన సైనిక, భద్రతా అటాచీలను “పర్సోనా నాన్ గ్రాటా” (అవాంఛనీయ వ్యక్తులు)గా ప్రకటించింది. వారిని కేవలం 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అల్టిమేటం జారీ చేసింది.
READ ALSO: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఈ ఘటనకు నేపథ్యం ఇదే..
బుధవారం రాత్రి ఖతార్లోని కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక నగరంపై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ప్రపంచానికే ఇంధన వనరుగా ఉన్న ఈ ఎల్ఎన్జి (LNG) సిటీపై దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఇది ఒక పూర్తి స్థాయి “ఇంధన యుద్ధం”గా మారే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దాడిపై ఖతార్ ప్రభుత్వం ఏమన్నదంటే..
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఇరాన్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. ఇరాన్ పదేపదే ఖతార్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దారుణంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను బరితెగించి ఉల్లంఘించడమేనని ఖతార్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఇరాన్ రాయబార కార్యాలయానికి పంపిన అధికారిక లేఖలో, సదరు అటాచీలకు, వారి సిబ్బందికి ఖతార్లో ఇకపై చోటు లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ దురాక్రమణకు గట్టి సమాధానం ఇస్తామని దోహా హెచ్చరించింది. తమ జాతీయ ప్రయోజనాలను, భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠినమైన చర్యలకైనా వెనుకాడబోమని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాల పరిధిలో తగిన రీతిలో ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని ఖతార్ నొక్కి చెప్పింది.
READ ALSO: Dhurandhar The Revenge Review: దురంధర్: ది రివెంజ్ రివ్యూ
