Pregnant Job Scam: “నన్ను ప్రెగ్నెంట్ చేస్తే.. రూ. 25 లక్షలు ఇస్తా”.. మహిళ బంపర్ ఆఫర్.. కట్చేస్తే..
Fake Pregnant Job Scam: పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను చూశాడు. అది అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ లోతైన స్వరంతో “నన్ను తల్లిని చేసే పురుషుడు కావాలి. నేను అతనికి 2.5 మిలియన్ రూపాయలు(రూ.25 లక్షలు) ఇస్తాను. అతని కులం, రంగు లేదా విద్యతో నాకు పట్టింపు లేదు “అని చెబుతోంది. ఈ వీడియోను ” గర్భిణీ ఉద్యోగం ” అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ కాంట్రాక్టర్ మొదట్లో ఇది వింతగా భావించాడు. కానీ రూ.25 లక్షలు ఆఫర్తో ఆకర్షితుడై.. వెంటనే వీడియోలో ఇచ్చిన నంబరుకు ఫోన్ కొట్టాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తి తాను ” ప్రెగ్నెంట్ జాబ్ ” అనే కంపెనీకి అసిస్టెంట్గా పరిచయం చేసుకున్నాడు. ఈ ఉద్యోగం కోసం తాను మొదట కంపెనీలో రిజిస్టర్ చేసుకోవాలని.. అనంతరం ఐడీ కార్డు, ఇతర అవసరమైన పత్రాలు ఇస్తామని కాంట్రాక్టర్తో చెప్పాడు. ఇక్కడే అసలు ఆట మొదలైంది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆ తర్వాత ఐడీ కార్డు ఛార్జీలు, వెరిఫికేషన్, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ డబ్బులు గుంజడం ప్రారంభించారు.
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
పోలీసుల కథనం ప్రకారం.. ఆ కాంట్రాక్టర్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 23 వరకు 100కి పైగా ఆన్లైన్ బదిలీలు చేశాడు. కొన్నిసార్లు UPI, కొన్నిసార్లు IMPS ద్వారా మొత్తం సుమారు 11 లక్షల రూపాయలు పంపాడు. డబ్బు దండుకున్న గుర్తు తెలియని వ్యక్తి.. మొదట్లో తన ఐడీ ప్రాసెసింగ్లో ఉందని చెప్పాడు. త్వరలోనే ఆ మహిళను తీసుకొచ్చి తన దగ్గరకు వస్తానని హామీ ఇచ్చాడు. నెమ్మదిగా కళ్లు తెరుచుకున్న కాంట్రాక్టర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. దీంతో అవతలి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానాలను బట్టి తాను మోసపోయానని గ్రహించిన కాంట్రాక్టర్ బనేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డబ్బు బదిలీ చేసిన మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల సమచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం కేవలం పూణేకే పరిమితం కాదని.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి.. డబ్బు ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆపై వేర్వేరు ఛార్జీల పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. 2022 చివరి నుంచి అనేక రాష్ట్రాల్లో ఇటువంటి మోసపూరిత వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని సైబర్ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా మంది ఈ విధంగా మోసపోయారు.
READ MORE: Starlink: భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ లింక్.. శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్స్ ప్రారంభం
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!