PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSL: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) చివరి దశకు చేరుకుంటోంది. నిన్న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా జరిగిన ప్లేఆఫ్స్ పోరులో హైదరాబాద్ కింగ్స్మెన్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.
చివరి ఆరు బంతుల్లో ఇస్లామాబాద్ యునైటెడ్ విజయానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే కావాలి. క్రీజులో ఉన్న బ్యాటర్లను చూస్తే ఇస్లామాబాద్ విజయం ఖాయమని అందరూ భావించారు. అయితే, పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా తమ్ముడైన హునైన్ షా అద్భుతం చేశాడు. అత్యంత ఒత్తిడిలోనూ ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ చేసిన హునైన్, ఆ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఫహీమ్ అష్రఫ్ వికెట్ను పడగొట్టాడు. తన అన్న నసీమ్ షాను గుర్తుకు తెచ్చేలా అతను వేసిన బంతులకు ఇస్లామాబాద్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. విజయం ఖరారు కావడంతో కింగ్స్మెన్ ఆటగాళ్లు మైదానంలోకి దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు.
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ కింగ్స్మెన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ కేవలం 30 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, కుశాల్ పెరీరా 21 బంతుల్లో 37 పరుగులు చేసి అతడికి తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యం జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. ఇక లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ యునైటెడ్ సైతం గట్టిగానే పోరాడింది. మార్క్ చాప్మన్ (43), హైదర్ అలీ (31) ఇన్నింగ్స్ను చక్కదిద్దగా, ఆఖర్లో ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ గ్రీన్ కేవలం 5 బంతుల్లోనే 19 పరుగులు చేసి మ్యాచ్ను ఇస్లామాబాద్ వైపు తిప్పాడు. గ్రీన్ మెరుపులతో విజయం అంచుల వరకు వచ్చిన యునైటెడ్ను హునైన్ షా తన బౌలింగ్తో అడ్డుకున్నాడు. ఈ విజయంతో ఫైనల్కు చేరిన హైదరాబాద్ కింగ్స్మెన్, ఆదివారం గడ్డాఫీ స్టేడియంలోనే జరిగే తుది పోరులో పెషావర్ జల్మీతో తలపడనుంది.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!