Rice : బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice : మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన నిత్యావసర వస్తువులలో ప్రధానమైనది బియ్యం. అన్నం తినకుండే మనకు రోజు గడవదు. మనం ఎంత కష్ట పడిన జానెడు పొట్టకోసమే. చాలామంది బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు. ఇలా నిల్వ చేసుకోవడం మంచిదే. కానీ ఇలా నిల్వ చేసుకోవడం వల్ల బియ్యంలో పురుగులు పడతాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యానికి పడతాయి. ఇలాంటి బియ్యాన్ని వండుకుని తింటే లేనిపోని రోగాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక మనం బియ్యంలో పురుగులు పడకుండా నిల్వ చేసుకోవాలి.
మార్కెట్ లో బియ్యానికి పురుగు పట్టకుండా చేసే పౌడర్ లు దొరుకుతుంటాయి. ఈ పౌడర్ ను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. కానీ ఇలా రసాయనాలు కలిగిన పౌడర్ ను వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిలోనే చిన్న చిట్కాలను ఉపయోగించి మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. పురుగు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేయడం చాలా కష్టం. బియ్యం నుండి ఒక్కో పురుగును తీయడం చాలా కష్టం. వీటిని శుభ్రం చేయడానికి కూడా చాలా సమయం పడుతుంది. బియ్యం పురుగు పట్టాక శుభ్రం చేయడం కంటే పురుగు పట్టకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది.
Also Read
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
Read Also:Telangana: ఏం కొడుకులు రా నాయనా..? తల్లిని గెంటేసి ఇంటికి తాళం..
బియ్యం పురుగుపట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో తేమ కూడా ఒకటి. బియ్యం నిల్వ చేసిన ప్రదేశం చుట్టూ లేదా ఆ ప్రదేశంలో తేమ ఉండడం వల్ల బియ్యం పురుగు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక బియ్యాన్ని నిల్వ చేసే ప్రదేశం చుట్టూ తేమ లేకుండా చూసుకోవాలి. ఇంగువను ఉపయోగించి కూడా మనం బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. దీని ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు రాకుండా ఉంటాయి. ఇంగువ పొడిని చిన్న మూటలుగా కట్టి బియ్యంలో అక్కడక్కడ ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
కర్ఫూరాన్ని కూడా ఇదే విధంగా మూటలుగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి. బియ్యం పురుగు పట్టకుండా చేయడంలో వేపాకు ఎంతో సహాయపడుతుంది. బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగాన వేపాకును ఉంచి ఈ వేపాకుపై బియ్యాన్ని పోయాలి లేదా వేప చెట్టు ఆకుల పొడిని మూటలుగా కట్టి బియ్యంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
Read Also:Tea plantations: టీ తోటలను కాపాడేందుకు ఇంత కష్టపడ్డారా?
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు రాదు. బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది.
ఒక వస్త్రంలో గుప్పెడు ఉప్పును ఉంచి మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు రావు. ఇలా పురుగులు పట్టిన బియ్యంలో ఉంచినా కూడా పురుగులు తొలగిపోతాయి. ఎండబెట్టిన కాకరకాయ ముక్కలను లేదా వాటి పొడిని మూటగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం బియ్యానికి పురుగు పట్టకుండా చేయవచ్చు.
తాజావార్తలు
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
-
Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
-
Michael Movie OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!