Kodandaram: రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ.. రాష్ట్రంలో నియంత పాలన, పొత్తులపై చర్చించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodandaram: తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసమితి పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జనసమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ కలిశారు. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్ల కోదండరామ్ సీట్లు అడుగుతారని చెప్పారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను గెలవాలని జన సమితి భావిస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని దాన్ని అంతమొందించేందుకు పొత్తులపై చర్చించామని అన్నారు. తదుపరి విషయాలు త్వరలో తెలియజేస్తామన్నారు. కరీంనగర్ V-పార్క్ నుంచి మూడో రోజు కాంగ్రేస్ విజయ భేరి యాత్ర ప్రారంభమైంది. కోదండరాం తో సమావేశం అనంతరం జగిత్యాల కార్నర్ మీటింగ్ లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బయలుదేరారు.
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ ధ్వంసమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రొ. కోదండరామ్ అన్నారు. అప్పట్లో చెప్పులు లేకుండా రాజభవనాలకు వెళ్లారని, ఇప్పుడు ప్రగతి భవన్ గేటు దాటలేకపోతున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో విద్యా వ్యవస్థ? విధ్వంసం? గురువారం ప్రెస్క్లబ్లో తెలంగాణ కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీష్ అధ్యక్షతన చర్చా వేదిక జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రొ.కోదండరామ్ హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు స్థాపించిన కాలేజీలపైనే విజిలెన్స్ దాడులకు తెగబడుతున్నారని, వేధింపుల కారణంగా చాలా కాలేజీలు మూతపడ్డాయన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయడం లేదని, చిన్న కాలేజీలపైనే ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగి వస్తే తప్ప తెలంగాణలో విద్యారంగం బాగుపడదన్నారు. డబ్బుల ఆటలో ప్రజలు గల్లంతు అవుతున్నారని, తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, సమస్యలపై పోరాడే వారికి అండగా నిలుస్తానన్నారు.
Google Pay: గుడ్న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక, ఎక్కడికీ పోవాల్సిన పనిలేదు..!
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!