ప్రధానమంత్రి మోడీ నేడు, రేపు గుజరాత్లో పర్యటించనున్నారు. స్వరాష్ట్రంలో రెండు రోజుల పర్యటన సందర్భంగా గుజరాత్లో రూ.77,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి ప్రధాని గుజరాత్ కు వస్తుండటంతో భారీగా స్వాగత ఏర్పాట్లు చేసింది బిజెపి. మోడీ దాహోద్లోని లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని దేశానికి అంకితం చేయనున్నారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Also Read:Tragedy : చర్లపల్లి రైల్వే స్టేషన్లో విషాదం.. అత్తగారి ఇంటికి వెళ్తూ అనంత లోకాలకు
దాహోద్లో దాదాపు రూ.24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. భుజ్లో రూ.53,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధానమంత్రి మే 27న గాంధీనగర్ను సందర్శించి గుజరాత్ పట్టణాభివృద్ధి 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై, పట్టణాభివృద్ధి సంవత్సరం 2025ను ప్రారంభిస్తారు.
Also Read:Keerthi Suresh : అన్ని భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తాను..
కనెక్టివిటీని పెంపొందించడానికి, ప్రపంచ స్థాయి ప్రయాణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి మోదీ దాహోద్లో భారతీయ రైల్వేల లోకోమోటివ్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్ దేశీయ అవసరాలకు, ఎగుమతి కోసం 9000 HP ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ నుంచి తయారైన తొలి ఎలక్ట్రిక్ ఇంజిన్ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ ఇంజిన్లు భారతీయ రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి.
