Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Price : దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. ఇంధనం ధరలు భగభగ మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు చాలా ఖరీదైపోయాయి. ఇప్పుడు వీటికి తోడు మరొకటి తోడైంది. ఏప్రిల్ నెల నుండి మందుల ధరలు భారీగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు ఇప్పడు మరింత చిల్లులు పడనున్నాయి. జనవరి నుంచి మందుల ధరలు పెంచాలని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పలుమార్లు డిమాండ్ చేశాయి. అనేక వస్తువుల ధరల కారణంగా కంపెనీల ఉత్పత్తి వ్యయం పెరిగింది. దాన్ని పూరించడానికి కంపెనీలు మందుల ధరలను పెంచేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. కేంద్రం కంపెనీల డిమాండుకు అనుమతించాయి.
ఒక నివేదిక ప్రకారం, మందుల ధర 12 శాతానికి పైగా పెరుగుతుంది. మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండో ఏడాది. షెడ్యూల్డ్ ఔషధాల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మందుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుంది. నిబంధనల ప్రకారం ధర పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత ధర మారుతుంది. డబ్ల్యుపిఐ తగ్గడం వల్ల గత ఏడాది ఔషధాల ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని సంవత్సరాలలో, రేటు పెంపు 1% మరియు 2% మధ్య ఉంది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read
Read Also: Minister KTR: మెట్రోరైల్ ప్రాజెక్ట్ రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రం.. మంత్రి కేటీఆర్ ఆగ్రహం
ధరలు పెరిగే వాటిలో నొప్పి నివారణలు, యాంటీబయాటిక్స్, గుండెకు సంబంధించినవి, క్షయ, ఇతర వ్యాధులకు సంబంధించినవి. ధరల పెంపుతో సామాన్య ప్రజానీకానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. వార్షిక టోకు ధరల సూచిక (WPI) ఆధారంగా ఈ ఆమోదం ఇవ్వబడుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీల విలువను నిర్ణయించే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) సోమవారం దీనికి సంబంధించి సూచన ఇచ్చింది.
Read Also: Bacteria : టాయిలెట్ సీటు కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండే ప్రదేశాలు ఏంటో తెలుసా ?
ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) సోమవారం వెల్లడించింది. దీని ప్రకారం, వార్షిక టోకు ధరల సూచిక ప్రకారం, ఔషధ కంపెనీలు మందుల ధరలను పెంచవచ్చు. ఏప్రిల్ నుంచి కొత్త ధర ప్రకారం వినియోగదారులపై భారం పడనుంది. ముడిసరుకు, సరఫరా, రవాణా, ఇతర ఖర్చుల పెరుగుదల కారణంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ధరల పెంపు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయంతో కంపెనీలు ఉపశమనం పొందుతున్నాయి. ఇది ఫార్మాస్యూటికల్ రంగం, కంపెనీలకు ఖర్చులను భర్తీ చేయడానికి సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
-
Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!