Onion Price : భారీగా పడిపోయిన ఉల్లి ధర.. వినియోగదారులు హ్యాపీ.. రైతుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Price : పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి. డిసెంబర్ 7న ఉల్లి ఎగుమతిపై మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీని తర్వాత హోల్సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు దాదాపు 50శాతం పడిపోయాయి. రానున్న వారాల్లో ధరలు స్థిరంగా ఉంటాయని లేదా స్వల్పంగా తగ్గుతాయని వ్యాపారులు తెలిపారు. లాసల్గావ్ AMPC వద్ద ఉల్లి సగటు హోల్సేల్ ధర కిలోకు రూ. 20-21కి పెరిగింది. ఎగుమతి నిషేధం విధించబడటానికి ముందు ఇది కిలోకు రూ. 39-40గా ఉండేది.
Read Also:Andhrapradesh: ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. అప్రమత్తమైన వైద్యశాఖ
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
డిసెంబర్ 7 నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఊరట లభించగా, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ఎగుమతి నిషేధం తర్వాత లాసల్గావ్, నాసిక్ జిల్లాల్లోని 17 మార్కెట్ కమిటీలలో ఉల్లి ధర తగ్గడం ప్రారంభమైంది. ఉల్లి ధర క్వింటాల్కు రూ.3 వేల నుంచి రూ.1500కి తగ్గింది. అసలు ధర కూడా భరించలేని స్థాయిలో ఉల్లి ధరలు పడిపోతున్నాయి. అందుకే నాసిక్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రైతులు ఉల్లిని ఉచితంగా పంపిణీ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఒక నెల క్రితం కిలో ఉల్లి ధర రూ.35 కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో కిలో రూ.20 కంటే తక్కువగా ఉంది.
Read Also:Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
రోజుకు సుమారు రూ. 6 నుండి రూ.7 కోట్ల నష్టం
నాసిక్ జిల్లా రైతుల ప్రకారం.. ఉల్లి ధరలు బాగా పడిపోవడంతో రూ. 150 నుండి 200 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో వ్యాపారులు, మార్కెట్ కమిటీలు కూడా భారీగా నష్టపోయాయి. లాసల్గావ్ ఎపిఎంసి మార్కెట్లో వించూర్, నిఫాద్, యోలా ఇతర మార్కెట్లో రోజువారీ వినియోగం 40,000 క్వింటాళ్లు కాగా, నాసిక్ జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో మొత్తం 1.5 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వ ఉంది. ఒక్క లాసల్గావ్లోనే రైతులు ప్రతిరోజూ దాదాపు రూ.6 నుండి రూ.7 కోట్ల వరకు నష్టపోతున్నారు.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!