Indian Constitution: గుడ్న్యూస్.. తెలుగు సహా.. 9 భాషల్లో రాజ్యాంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Constitution: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు సులువుగా అర్థం చేసుకునే రోజు వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్గా విడుదల చేశారు. తెలుగు భాష సహా.. మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళంలో రాజ్యాంగాన్ని అనువాదించారు. ఈ రోజు మొత్తం దేశం రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
READ MORE: PM Modi: హైదరాబాద్లో జీఎంఆర్ ఎయిర్పార్క్ను వర్చువల్గా ప్రారంభించిన మోడీ
Also Read
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానిది. ఇందులో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు 448 అధికకరణలు ఉన్నాయి. రాజ్యాంగం ఇంగ్లీషు ప్రతిలో దాదాపు 1,17,369 పదాలున్నాయి. ఇంగ్లీషు, హిందీ రెండు కాపీలు చేతితోనే రాశారు. హిందీ, ఇంగ్లీషులో రాసిన రాజ్యాంగం అసలు కాపీలు హీలియంతో నింపిన ప్రత్యేకమైన కేసుల్లో పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు. రాజ్యాంగ ప్రతులను ప్రేమ్ బిహరీ నారాయణ్ అనే వ్యక్తి ఇటాలిక్ శైలిలో అందంగా రాశారు. ఇందుకోసం ఆయన ఆరు నెలల సమయాన్ని వెచ్చించి దాదాపు 254 పాళీలు ఉపయోగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకోని ప్రేమ్ బిహారీ.. కేవలం తన పేరును ప్రతిపేజీలో ఉండేలా కోరారు.
READ MORE: Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!
భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అన్న విషయం అందరికి తెలుసు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేసారు. ఆ సమయంలోనే వర్షంపడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు.
READ MORE: Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!
అదే రోజు అంటే 1950 జనవరి 26న గణతంత్ర భారత్కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్ నిర్వహించారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?