Preity Zinta-IPL 2024: ప్రీతి జింటా చేసిన పొరపాటు.. పంజాబ్ కింగ్స్కు వరంలా మారింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashank Singh is a Star for PBKS in IPL 2024: డిసెంబర్ 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఎడిషన్ కోసం మినీ వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు. 19 ఏళ్ల బ్యాటర్కు బదులుగా.. ఛత్తీస్గఢ్కు చెందిన 32 ఏళ్ల శశాంక్ సింగ్ను రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ సింగ్ తమ టార్గెట్ లిస్ట్లో ఉన్నాడని కవర్ చేసింది.
వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసేందుకు సాయపడ్డాడు. 19 ఓవర్లకు పంజాబ్ 6 వికెట్స్ కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అయితే 20వ ఓవర్లో శశాంక్ సింగ్ చెలరేగాడు. ఆర్సీబీ పేసర్ అల్జారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. దాంతో ఆ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. శశాంక్ హిట్టింగ్తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Virat Kohli: ఇప్పటికీ నా పేరే.. జట్టులో స్థానం దక్కుతుంది: కోహ్లీ
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయం ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో చివరివరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45; 37 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్. లక్ష్యాన్ని ఆర్సీబీ మరో నాలుగు బంతులు ఉండగానే 6 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. పంజాబ్ ప్రధాన పేసర్లు అర్ష్దీప్ (3.2 ఓవర్లలో 40), హర్షల్ పటేల్ (1/45) ధారాళంగా పరుగులిచ్చారు.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!