Site icon NTV Telugu

Pratyusha Death Case: “నా బిడ్డ శరీరాన్ని వాళ్ల ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు”.. ప్రత్యూష తల్లి సరోజిని

Sarojini

Sarojini

Pratyusha Death Case: సంచలనం సృష్టించిన హీరోయిన్ ప్రత్యూష మరణం కేసులో ఆమె తల్లి సరోజిని తాజాగా వెల్లడించిన అంశాలు విస్తుగొలుపుతున్నాయి. తన బిడ్డ మరణానికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో తన బిడ్డ చికిత్స పొందుతున్న సమయంలో వైద్యులు తనను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని సరోజిని వాపోయారు. “దాదాపు రెండు గంటల పాటు నన్ను ఐసీయూ (ICU) బయటే పిచ్చిదానిలా నిలబెట్టారు. లోపల చికిత్స జరుగుతోంది, మీరు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించారు. ఐసీయూ తలుపు ముందే కన్నీళ్లతో వేచి చూశాను తప్ప, నా బిడ్డను తాకే భాగ్యం కూడా కలగలేదు” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

READ ALSO: Pakistan: ప్రాణాల కోసం ఏడుస్తున్న పాక్ సైనికులు.. BLA కొత్త వీడియో..

ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తనకు పొంతన లేని సమాధానాలు ఇచ్చారని ఆమె ఆరోపించారు. “నేను డ్రెస్ తెచ్చి ఇచ్చిన అరగంట ముందే ‘పాప బాగానే ఉంది’ అని చెప్పారు. కానీ సరిగ్గా 30 నిమిషాల తర్వాత గుండెపోటుతో చనిపోయిందని ప్రకటించారు. అంతలోనే ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అరగంటలో పరిస్థితి అంతగా ఎలా విషమించింది?” అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని అప్పగించడంలో జరిగిన జాప్యంపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా బిడ్డ శరీరాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారు. లోపల ఏం జరిగిందో, ఏ సాక్ష్యాలను మాయం చేశారో ఎవరికి తెలుసు? రాత్రి 11 గంటలకు మరణవార్త చెబితే, మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురాలేదు. అప్పటివరకు లోపల ఏం చేశారు?” అంటూ ఆసుపత్రి నిర్వాహకులపై తన అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.

READ ALSO: Actress Pratyusha Case: సాక్ష్యాలను తగలబెట్టేశారు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి సంచలన కామెంట్స్

Exit mobile version