NTV Telugu Site icon

Prashanth Reddy : రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ

Prashanth Reddy

Prashanth Reddy

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విద్యుత్ కమిషన్ చైర్మన్ పై వాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. విచారణ కాకముందే ప్రెస్స్ మీట్ లు పెట్టీ చెప్పటం తప్పు అని చెప్పిందని ఆయన ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటం, పైన తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంటే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే కమిషన్ విచారణ అని, విద్యుత్ కొనుగోళ్లు అప్పటి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలే అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని సక్రమంగానే జరిగాయని, కానీ అవేవీ పట్టించు కోకుండ ఛైర్మెన్ ఇష్టానుసారంగా మీడియాకు వివరాలు చెప్పారన్నారు ప్రశాంత్‌ రెడ్డి. ఎలాగైనా కేసిఆర్ ను ఇలా ఇరికించాలని చూసారని, అందుకే సుప్రీం తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందని ప్రశాంత్‌ రెడ్డి. తెలంగాణ సాధనే కరెంటు కోసమన్నారు ప్రశాంత్‌ రెడ్డి. బీడు భూములు సస్యశ్యామలం చేసేందుకు కేసిఆర్ అనేక ప్రణాళికలు చేశారని, కరెంట్ ఇచ్చి పరిశ్రమలు కాపాడాలని కేసిఆర్ బలమైన దీక్షతో కరెంట్ ఇచ్చారన్నారు ప్రశాంత్‌ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇస్తే దేశ వ్యాప్తంగా కేసిఆర్ మంచి పేరు వస్తుందని బురద జల్లడానికి చిల్లర ప్రయత్నం చేసారని, కానీ ప్రభుత్వానికి రివర్స్ అయ్యిందని ఆయన అన్నారు.