Prakash Raj : నాకు నేషనల్ అవార్డ్ వస్తే ఎవరూ పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ అవార్డ్స్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. 25 సంవత్సరాల క్రితం అంతఃపురం సినిమాకుగాను తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అప్పుడు తనను టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.అల్లు అర్జున్ తో పాటు నేషనల్ అవార్డు వచ్చిన తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే.. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ఎంతో హాట్ టాపిక్గా మారాయి.అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు రావడం అంటే తెలుగు వారందరికి ఎంతో గర్వకారణమని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇలాంటి సన్మాన వేడుకలకు తెలుగు హీరోలతో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలిసిరావడం లేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. అవార్డులు వస్తే ఒకరినొకరు ప్రశంసించుకోవడం మర్చిపోతున్నారని ఆయన అన్నారు..
మన ఇంట్లో వాళ్లని మనం గౌరవించుకోకపోతే అవతలి వాళ్లు మనల్ని ఎలా గౌరవిస్తారని ప్రకాష్ రాజ్ తెలిపారు ఇలాంటి వివక్ష ను భరించలేకే నేను చాలా రోజులుగా సినిమా వేడుకలకు దూరంగా ఉంటున్నానని, కానీ ఈ వేడుక గురించి మైత్రీ మూవీ మేకర్స్ చెప్పగానే వెంటనే వచ్చానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ వేడుకకు సీనియర్లు కూడా దూరంగా ఉండటం బాధను కలిగిచిందని ఆయన తెలిపారు.మరోవైపు యంగ్ డైరెక్టర్లు రావడం ఎంతో ఆనందంగా అనిపించిందని ప్రకాష్ రాజ్ తెలిపారు..అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా గంగోత్రిలో తాను నటించానని, తనతో కలిసి నటించే సమయంలో ట్రైపాడ్ కెమెరా కింద కూర్చుని ఎంతో టెన్షన్ పడుతున్న అల్లుఅర్జున్ ని చూసిన ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు, ఆ సమయంలో అల్లుఅర్జున్ కష్టపడాలనే తపన నేను చూసానని , అప్పుడే అతడు ఉన్నత స్థానానికి చేరుకుంటాడని నేను అనుకున్నానని ప్రకాష్ రాజ్ చెప్పాడు. నేషనల్ అవార్డ్తో నేటి యువతకు అల్లు అర్జున్ స్ఫూర్తిగా నిలిచాడని ప్రకాష్ రాజ్ తెలిపారు..బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నా కొడుకు వచ్చినంత ఆనందం ఉందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!