Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గతేడాది సలార్, కల్కి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమానుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూల్ లుక్ లో అదుర్స్ అనిపించాడు ప్రభాస్. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, హను రాఘవపూడి డైరెక్షన్లో ‘ఫౌజీ’ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. ఒకట్రెండు టాక్ షోలలో కనిపించిన ప్రభాస్, ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ టాక్ షోలో ముఖ్య అతిథిగా రానున్నారు.
Read Also:Telangana: నేడు సౌత్ కొరియాలోని హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
లెజెండరీ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ‘‘నా ఉచ్ఛ్వాసం కవనం’’ అనే టాక్ షో టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈ టాక్ షోలోని తాజా ఎపిసోడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేయనున్నాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకు ఉన్నటువంటి అనుభవాలను ఈ కార్యక్రమంలో అభిమానులతో పంచుకోనున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ని ఆదివారం ఉదయం 9 గంటలకు టెలికాస్ట్ చేశారు. దీంతో తమ అభిమాన నటుడిని బుల్లితెరపై చూసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజైన ఆగస్టు 23న గ్రాండ్గా సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.
Read Also:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల