హిందువులు అందరు పూజలు చేస్తారు.. అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు.. కానీ కొన్ని నియమాలను తప్పితే.. పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే.. ఆ తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
మాములుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని అస్సలు చదవరాదు.. మహాపాపం.. శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ నిల్చొని చెయ్యకూడదు. ఎప్పుడు కూర్చొని మాత్రమే చెయ్యాలి.. అలాగే పూజ చేసే టైం లో నుదుటి పై బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి.. అలా పెట్టుకోకుండా పూజలు చెయ్యరాదు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
అలాగే ఒక్కచేత్తో ఎప్పుడు నమస్కరించకూడదు.. ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు.. అలాగే ఈశ్వరునిక వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. కాబట్టి ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డి కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయంలో ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి.. అదే విధంగా రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. స్త్రీలు చేయకూడని కొన్ని పొరపాట్ల విషయానికి వస్తే.. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను.. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండకూడదు.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది.. భర్తకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు.. ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..