Site icon NTV Telugu

Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

Accused Arrest

Accused Arrest

Accused Arrest: రాజధాని ఢిల్లీ నగరంలో అక్టోబర్ 11 రాత్రి కాలే ఖాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన రక్తంతో ఉన్న మహిళను కనుగొన్నారు పోలీసులు. ఈ స్థితిలో ఉన్న మహిళను చూసిన వెంటనే నేవీ సిబ్బంది ఆమెను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. దీంతో సైనికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదంపై పోలీసులు మహిళను విచారించేందుకు ప్రయత్నించగా, షాక్‌కు గురైన ఆమె ఏమీ సరిగ్గా చెప్పలేకపోయిందని తెలిపారు. ఆ సమయంలో మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వైద్య పరీక్షల నివేదికలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

Also Read: Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!

ఒరిస్సాకు చెందిన 34 ఏళ్ల బాధితురాలు నర్సింగ్ చదివి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నారు. కేసును విచారించగా.. కదులుతున్న ఆటోలో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసినట్లు తేలింది. రాజ్‌ఘాట్ సమీపంలోని గాంధీ స్మృతి రహదారిలో మహిళా, రక్తంతో ఉన్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు నెల రోజుల పాటు శ్రమించిన తర్వాత, గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మహిళపై అత్యాచారం చేసిన ఆటోను కూడా సీజ్ చేశారు. నిందితులను ఆటో నడుపుతున్న ప్రభు, స్క్రాప్ షాపులో పనిచేసే ప్రమోద్, షంషుల్‌గా గుర్తించారు. ఈ విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ పోలీసుల నుండి విచారణ నివేదికను కూడా కోరారు. ప్రస్తుతం, ఈ ముగ్గురు నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.

Also Read: California wildfire: భారీగా కార్చిచ్చు.. భారీగా ఇళ్లను వదిలివెళ్తున్న ప్రజలు

Exit mobile version