PM Modi: ఒడిశా సీఎంకు జిల్లాల పేర్లు తెలుసా? నవీన్ పట్నాయక్కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తీరికలేకుండా ప్రచారం సాగిస్తున్నారు. శనివారం ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
స్క్రిప్ట్స్ సహాయం లేకుండా ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు చెప్పగలరా అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని మోడీ సవాలు విసిరారు. ఒడిశాలోని కంధమాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను చేస్తున్న ఈ ఛాలెంజ్ నవీన్ పట్నాయక్కు ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రం గురించి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుపుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కాగితాలు చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు, వాటి కేంద్రాల పేర్లు చెప్పమనండని సవాల్ విసిరారు.. పేర్లనే చెప్పలేకపోతే ఇక మీరు పడుతున్న బాధను ఎలా తెలుసుకుంటారని మోడీ ప్రజలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుస్తానని మోడీ హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలు ఒడిశా అభివృద్ధికి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్ష వంటి చారిత్రాత్మక సంఘటనలను ఉటంకిస్తూ ప్రధాని భారత దేశ సార్థ్యాన్ని కొనియాడారు. 26 సంవత్సరాల క్రితం, అటల్ బిహారీ వాజ్పేయీ పోఖ్రాన్ పరీక్షను నిర్వహించారన్నారు. ఈ అణు పరీక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వంగా తలెత్తుకునేలా చేసిందని తెలిపారు. భారత్ మొదటిసారిగా తన సామర్థ్యాలను ప్రపంచానికి తెలిపిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, దాన్ని మనం గౌరవించాలని చెబుతున్నారని విమర్శించారు. పాక్ పేరు చెప్పి సొంత ప్రజలనే భయపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోడీ ధ్వజమెత్తారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు..ప్రతిపక్ష హోదా రాదు..
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!