PM Modi: ఒడిశా సీఎంకు జిల్లాల పేర్లు తెలుసా? నవీన్ పట్నాయక్కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తీరికలేకుండా ప్రచారం సాగిస్తున్నారు. శనివారం ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇది కూడా చదవండి: Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి
Also Read
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- CM Revanth Reddy: తెలంగాణకు 'మెగా గ్రోత్ కారిడార్'.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
స్క్రిప్ట్స్ సహాయం లేకుండా ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు చెప్పగలరా అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని మోడీ సవాలు విసిరారు. ఒడిశాలోని కంధమాల్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను చేస్తున్న ఈ ఛాలెంజ్ నవీన్ పట్నాయక్కు ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రం గురించి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుపుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కాగితాలు చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు, వాటి కేంద్రాల పేర్లు చెప్పమనండని సవాల్ విసిరారు.. పేర్లనే చెప్పలేకపోతే ఇక మీరు పడుతున్న బాధను ఎలా తెలుసుకుంటారని మోడీ ప్రజలను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుస్తానని మోడీ హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలు ఒడిశా అభివృద్ధికి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్ష వంటి చారిత్రాత్మక సంఘటనలను ఉటంకిస్తూ ప్రధాని భారత దేశ సార్థ్యాన్ని కొనియాడారు. 26 సంవత్సరాల క్రితం, అటల్ బిహారీ వాజ్పేయీ పోఖ్రాన్ పరీక్షను నిర్వహించారన్నారు. ఈ అణు పరీక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వంగా తలెత్తుకునేలా చేసిందని తెలిపారు. భారత్ మొదటిసారిగా తన సామర్థ్యాలను ప్రపంచానికి తెలిపిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, దాన్ని మనం గౌరవించాలని చెబుతున్నారని విమర్శించారు. పాక్ పేరు చెప్పి సొంత ప్రజలనే భయపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మోడీ ధ్వజమెత్తారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు..ప్రతిపక్ష హోదా రాదు..
తాజావార్తలు
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
-
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లకు ఔటర్ రింగ్ రోడ్లు..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!