Site icon NTV Telugu

PM Modi: నేడు అలీఘర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన..

Modi

Modi

లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (సోమవారం) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అలీఘర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు. అ తర్వాత ప్రధాని ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో అలీగఢ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఇక, పెద్ద వాహనాలు బైపాస్‌ మీదుగా వెళ్తాయని వెల్లడించారు.

Read Also: Election Campaign Material Market : ఎన్నికల ప్రచారంలో డిజిటల్ హోరు.. మందగించిన ప్రచార సామగ్రి మార్కెట్

ఇక, ఈ బహిరంగ సభలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. అంతకుముందు, ముఖ్యమంత్రి ఆగ్రాలోని కిరావాలి ప్రాంతంలో బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. బరేలీలోని రోహిల్‌ఖండ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వాలంటీర్ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, సీతాపూర్, బ్రజేష్ పాఠక్ లఖింపూర్ ఖేరీ, ఉన్నావ్‌లలో బీజేపీ బూత్ అధ్యక్షులు, జల్ శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ హర్దోయ్, కాన్పూర్‌లో రాష్ట్ర మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి సమావేశాలలో ప్రసంగిస్తారు.

Read Also: Neha Murder Case: కాంగ్రెస్ కార్పొరేటర్ కుటుంబానికి జేపీ నడ్డా పరామర్శ.. నేహ హత్యపై సీబీఐ విచారణకు డిమాండ్..

అలాగే, మాధ్యమిక విద్యా శాఖ సహాయ మంత్రి గులాబ్ దేవి అమ్రోహా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంత మీరట్, పశ్చిమ ప్రాంతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సిసోడియా బాగ్‌పత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా సిద్ధార్థ్ నగర్, సంత్ కబీర్ నగర్‌లలో వివిధ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరట్‌లో జరిగే న్యాయవాదుల సదస్సులో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పాల్గొననున్నారు.

Exit mobile version