Modi Wang Yi meeting: ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ.. కీలకమైన విషయాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Wang Yi meeting: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్లో జిన్పింగ్తో సమావేశమైనప్పటి నుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. సున్నిత అంశాలను గౌరవించడం, పరస్పర ప్రయోజనాల ద్వారా ఇది సాధ్యమైంది. చైనాలోని టియాంజిన్లో నిర్వహించనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్పింగ్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. భారత్, చైనాల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయి” అని పేర్కొన్నారు.
READ MORE: Mumbai : భారీ వర్షంతో మార్గం మధ్యలో ఆగిపోయిన మోనో రైలు
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
ప్రధాని మోడీ తన వ్యాఖ్యలలో టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావించారు. SCO అనేది ఇండియా – చైనా రెండూ క్రియాశీల సభ్యులుగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతీయ వేదిక. దీని ద్వారా రెండు దేశాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై కలిసి పనిచేస్తాయి. చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అజిత్ డొబాల్ అధికారికంగా ప్రకటించారు.
తూర్పు లడఖ్లో సరిహద్దు వివాదం తర్వాత భారతదేశం – చైనా మధ్య సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరుదేశాలు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాయి. గత సంవత్సరం కజాన్లో జరిగిన సమావేశం, ఆ తర్వాత జరిగిన దౌత్య చర్చలు రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
READ MORE: Arjun Chakravarthy : నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య కథే ‘అర్జున్ చక్రవర్తి’
తాజావార్తలు
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!