NTV Telugu Site icon

PM Modi: నేను ఏం చెప్పినా ప్రపంచం నమ్ముతుంది : మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: మూడు దేశాల పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్‌కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సహా పలువురు నేతలు ఆయనకు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ప్రపంచ పర్యటనలో భారత యువత పరాక్రమాన్ని చెబుతానని ప్రపంచానికి చాటి చెపుతున్నానని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రశంసించినప్పుడు భారతీయులు సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం తాను విదేశాలకు వెళ్లి ఏదైనా మాట్లాడితే నేడు ప్రపంచం నమ్ముతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ విశ్వాసం భారతీయుల బలం. ప్రజల పూర్తి మెజారిటీ ప్రభుత్వానికి ఈ సామర్థ్యం కల్పించిందన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ, ముందుగా తాను ఈ పుణ్యభూమికి నమస్కరిస్తున్నానని, మన పూర్వీకులకు నమస్కరిస్తున్నానని, ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా దేశప్రజలందరికీ గౌరవంగా నమస్కరిస్తున్నానని అన్నారు.

Read Aslo: IPL 2023 Eliminator match: ఎలిమినేటర్ మ్యాచ్‌లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన రోహిత్‌ సేన..

తాను ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు గొప్ప వ్యక్తులను కలిసి.. భారతదేశ సామర్థ్యం గురించి చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలోని యువ తరం ప్రతిభను గురించి చర్చిస్తాను. నా దేశం యొక్క గొప్ప సంస్కృతిని కీర్తిస్తూ, నేను గర్వంగా వారిక కళ్లలోకి చూస్తూ మాట్లాడతాను. నేడు ఇక్కడ ఉన్న ప్రజలు మోదీని ప్రేమించే వారు కాదని, భారతమాతను ప్రేమించే వారని అన్నారు. వీరు భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తులు. భారతదేశం పేరు వెలుగులోకి వచ్చినప్పుడు, 140 కోట్ల మంది దేశ ప్రజల ఆత్మ కొత్త శిఖరాలను తాకుతుంది. ఇది బుద్ధుడు, గాంధీల దేశమని, అందరికీ న్యాయం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సవాళ్లను సవాలు చేయడం నా స్వభావం అని ప్రధాని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రాగానే దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోంది. నాకు లభించిన గౌరవం 140 కోట్ల మంది దేశ ప్రజలకు చెందుతుందని ప్రధాని అన్నారు.’

Read Aslo:Aditi Rao Hydari: సిద్దార్థ్ లవర్ ఎంత అందంగా ఉందో చూడండి