NTV Telugu Site icon

KP Sharma Oli: నాలుగోసారి నేపాల్‌ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు

Kp Sharma Oli

Kp Sharma Oli

KP Sharma Oli: హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరతను కల్పించే భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్న కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్‌లోని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. నేపాల్‌-యునైటెడ్‌ మార్క్సి స్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌-యూఎంఎల్‌), నేపాల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సీ)లతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ అలియాస్‌ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూలింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్‌ దహల్‌ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా.. ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడటంతో ప్రచండ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.

Read Also: Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని కాలేరు..! అతని పార్టీపై నిషేధానికి పాక్ ప్రభుత్వం సన్నాహాలు

నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడేల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీతో రాష్ట్రపతి భవన్ ప్రధాన భవనం శీతల్ నివాస్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. నేపాల్ ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన కేపీ శర్మ ఓలీని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.