Planetary Alignment: ఖగోళ ప్రియులకు పండగ లాంటి వార్త. అంతరిక్షంలో నేడు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోని ప్రధాన గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వచ్చి దర్శనమివ్వబోతున్నాయి. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒకే సరళ రేఖలో ఉండవు. కానీ భూమి నుండి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ‘ప్లానెటరీ అలైన్మెంట్’ (Planetary Alignment) అని పిలుస్తారు. ఈ అరుదైన ఘట్టంలో మొత్తం ఆరు గ్రహాలు బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ పాలుపంచుకుంటున్నాయి.
Roslin: దృశ్యం డైరెక్టర్ నుండి మరో థ్రిల్లర్.. ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మీనా ‘రోజలిన్’!
భారత కాలమానం ప్రకారం ఈ అద్భుత దృశ్యం ఈరోజు సాయంత్రం 6:15 నుండి రాత్రి 8:00 గంటల మధ్య అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాస్తమయం అయిన సుమారు 30 నుండి 45 నిమిషాల తర్వాత ఆకాశం వైపు చూస్తే ఈ గ్రహాల వరుసను గమనించవచ్చు. ఆకాశంలో పడమర దిశ నుండి మొదలై ఆగ్నేయం వరకు ఒక ‘విల్లు’ ఆకారంలో ఈ గ్రహాలు విస్తరించి ఉంటాయి.
ఈ వరుసలో బృహస్పతి, శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాయి. కాబట్టి వీటిని నేరుగా చూడొచ్చు. ఆకాశం స్వచ్ఛంగా ఉంటే శని, బుధుడు కూడా కంటికి కనిపిస్తాయి. ఇక యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు భూమికి చాలా దూరంలో ఉండటం వల్ల మసకగా కనపడుతాయి. వీటిని వీక్షించడానికి కచ్చితంగా బైనాక్లర్స్ లేదా టెలిస్కోప్ అవసరం. సూర్యుడు పూర్తిగా అస్తమించిన తర్వాతే టెలిస్కోప్ లేదా బైనాక్లర్స్ వాడటం సురక్షితం.
