Petrol Diesel Shortage: హైదరాబాద్తో సహా రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని అన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. నిన్నటి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెళిశాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
ఇప్పటికే, హైదరాబాద్లో కొన్ని రోజులుగా సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఉంది. క్యాబ్లు, ఆటోల లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పెట్రోల్, డీజిల్ సైతం దొరకడం లేదు. ఇటు నగరంలోనూ అటు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా, డీజిల్కు కొరత ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాత్రి నుంచి అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేశారు. దీంతో ఉద్యోగులు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరికొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే ఇంధనం లభించడంతో ఆ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మరోవైపు.. జనాలు పానిక్ అవుతున్న తరుణంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్దిగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురికావద్దని సూచించారు. రోజుకి 9,574 కిలో లీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24,000 కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్లను బంకుల ద్వారా వాహనదారులకు అందిస్తున్నట్లు తెలిపారు.
