Mcdonald: మెక్డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి
- మెక్డొనాల్డ్ బర్గర్ తిని.
- అమెరికాలో 49 మందికి అస్వస్థత..
- ఒకరు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mcdonald: మెక్డొనాల్డ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నగరాలూ, పట్టణాల్లో ఇవి కనపడుతాయి. ఇకపోతే, ఇప్పుడు అమెరికాలోని ప్రజలు మెక్డొనాల్డ్ బర్గర్ల గురించి భయాందోళనలకు గురవుతున్నారు. కొలరాడోలో బర్గర్ల కారణంగా ‘E. coli’ అనే వ్యాధి వస్తుందని బయటపడింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లతో ముడిపడి ఉన్న E. coli వ్యాధి వ్యాప్తి 10 రాష్ట్రాల్లో 49 మందిని అస్వస్థతకు గురి చేసిందని, అందులో 10 మంది ఆసుపత్రిలో ఉన్నారని నిర్ధారించింది. కొలరాడోలో 26 మంది అనారోగ్యంతో ఉన్న వారు ఎక్కువగా ప్రభావితమయ్యారు.
Read Also: Mcdonald: మెక్డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక ఈ కేసు విచారణలో భాగంగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ముందు మెక్డొనాల్డ్స్లో బర్గర్లు తిన్నట్లు దర్యాప్తులో తేలిందని, వారిలో ఎక్కువ మంది క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లు తిన్నట్లు నివేదించారని CDC అధికారులు తెలిపారు. అనారోగ్యానికి సంబంధించిన నిర్దిష్ట పదార్ధం గుర్తించబడలేదని, అయితే పరిశోధకులు తరిగిన ఉల్లిపాయలు ఇంకా గొడ్డు మాంసంను అనుమానిస్తున్నారని అధికారులు తెలిపారు. కొలరాడో, నెబ్రాస్కాలో చాలా మంది జబ్బుపడిన వ్యక్తులు కనుగొనబడ్డారు. దింతో ప్రస్తుతం, మెక్డొనాల్డ్స్ తరిగిన ఉల్లిపాయలు, గొడ్డు మాంసం, క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ లను నిలిపివేసింది.
Read Also: Wayanad bypoll: వయనాడ్లో ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు
ఇకపోతే, E. coli కడుపులో తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం, జ్వరం, అతిసారం, వాంతులను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న చాలా మంది వ్యక్తులు 3 నుండి 4 రోజులు లేదా బ్యాక్టీరియా ఉన్న ఏదైనా తినడం లేదా త్రాగిన తర్వాత 10 రోజుల వరకు అనారోగ్యానికి గురవుతారు. కొంతమంది 5 నుండి 7 రోజుల్లో కోలుకుంటారు. మరికొందరు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. ఈ E. coli O157:H7 తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది హాంబర్గర్లు తినడం ద్వారా 1993 లో అమెరికాలో కనుగొనబడింది. CDC ప్రకటన తర్వాత మెక్డొనాల్డ్ షేర్లు మంగళవారం తొమ్మిది శాతం పడిపోయాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!