Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు.. ఎగబడిన జనం

  • మురికి కాలువలో కొట్టుకొచ్చిన రూ.500 నోట్లు
  • డబ్బుల కోసం ఎగబడిన జనం
  • మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో ఘటన
Currency Notes

Currency Notes

Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు కొట్టుకొచ్చిన ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని ఆట్పాడిలో చోటుచేసుకుంది. మురికి కాలువలోని మురికి నీళ్లలో రూ.500 నోట్లు కనిపించడంతో జనాలు తొలుత వాటిని నకిలీ నోట్లుగా భావించారు. కానీ అవి నిజమైన నోట్లే అని తెలిశాక జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. కాలువలోని మొత్తం చెత్తను తొలగించి మరీ రూ.500 నోట్ల కోసం వెతికారు. జనాలు వీలైనన్ని ఎక్కువ నోట్లను సేకరించడానికి మురికి నీటిలోకి దిగి ప్రయత్నించారు. ప్రజలు సుమారు రూ.2 నుంచి 2.5 లక్షల వరకు కరెన్సీని సేకరించినట్లు అంచనా వేయబడింది.

Read Also: Deputy CM Pawan Kalyan: గత ఐదేళ్లలో పారిశుద్ధ్యంపై ఎలాంటి డబ్బులు ఖర్చులు చేయలేదు..

కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరికి చెందినవో ఎవరికీ తెలియదు. ఇంత నగదు దొరకడంతో ఉత్కంఠ నెలకొంది.అన్ని నోట్లన్నీ అసలైనవే కావడం పౌరులను ఉలిక్కిపడేలా చేసింది. ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి, కానీ ఇప్పటివరకు, ఎటువంటి సమాధానాలు వెలువడలేదు. సాంగ్లీ జిల్లాలోని ప్రజలే మాత్రమే కాకుండా ఈ విషయం గురించి వారు దీని గురించి చర్చించుకుంటున్నారు.