PBKS vs MI: శ్రేయస్ అయ్యర్ మెరుపులు.. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్!
- క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ విజయం
- శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా మెరుపులు
- ఆర్సీబీతో టైటిల్ పోరుకు సిద్ధమైన పీబీకేఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఐపీఎల్ 2025 ఫైనల్కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన పంజాబ్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. 204 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ దాటికి ముంబై మరో టైటిల్ కల చెదిరింది. ఫైనల్కు వెళ్లడం పంజాబ్కు ఇది రెండోసారి. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో పంజాబ్ మొదటిసారి ఫైనల్ చేరింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ ఫైనల్లో తలపడనుంది.
క్వాలిఫయర్-2లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమైనా.. జానీ బెయిర్స్టో (38: 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తిలక్ వర్మ (44: 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 15 పరుగులే చేసినా.. నమన్ ధీర్ (37: 18 బంతుల్లో 7 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్స్ పడగొట్టగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టాయినిస్, యుజ్వేంద్ర చహల్, వైశాక్ విజయ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ఛేదనలో పంజాబ్ కింగ్స్కు శుభారంభం దక్కలేదు. ప్రభు సిమ్రాన్ సింగ్ (6) తక్కువ పరుగులకే అవుట్ కాగా.. ఫామ్ మీదున్న ప్రియాంష్ ఆర్య (20) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ సమయంలో జోష్ ఇంగ్లిస్ (38: 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇంగ్లిస్ అవుట్ అయ్యాక పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నేహల్ వధేరా (48: 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి కింగ్స్ను విజయం వైపు నడిపించాడు. నేహల్, శశాంక్ సింగ్ (2) అవుట్ అయినా.. శ్రేయస్ చివరి వరకూ క్రీజులో ఉండి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!