NTV Telugu Site icon

Payal: డబ్బులివ్వకుండా వాడుకుంటున్నారు.. పాయల్ సంచలన ఆరోపణలు..

Rakshana

Rakshana

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈమధ్య సినిమాల స్పీడ్ పెంచేసింది.. ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది. గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమాలో పాయల్ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

పవర్ ఫుల్ స్టోరీతో రాబోతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు.. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తుంది.. తాజాగా ఈ విషయాన్ని పాయల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది..అందుకు కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.. డబ్బులివ్వకుండా పాయల్ ను మోసం చేస్తున్నారని ఇంస్టాగ్రామ్ లో ఆరోపిస్తూ పోస్ట్ చేసింది.. పాయల్.. ఇందులో నిజమేంటో తెలియాలంటే మరో అప్డేట్ వచ్చేవరకు ఆగాల్సిందే..

మంగళవారం సినిమాతో చాలెంజింగ్ రోల్ ను కూడా చెయ్యగలదని నిరూపించింది.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది పాయల్.. ఈ సినిమాలో రోషన్‌, మానస్‌, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందిస్తున్నారు..