NTV Telugu Site icon

Supreme Court: జీతం రాలేదంటూ సుప్రీంకోర్టులో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి ఆవేదన

Aupreme Court

Aupreme Court

జీతాల సమస్యపై పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ( జీపీఎఫ్) ఖాతా తెరిచి జీతం విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు. పదోన్నతి పొందినప్పటి నుంచి తనకు జీతం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నవంబర్ 2023లో హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి హైకోర్టుకు పదోన్నతి పొందిన తర్వాత ఇప్పటి వరకు తనకు జీపీఎఫ్ ఖాతా రాలేదని జస్టిస్ రుద్ర ప్రకాష్ మిశ్రా చెప్పారు. అందుకు అవసరమైన అన్ని పత్రాలు సమర్పించామని కోర్టుకు తెలిపారు. పదోన్నతి పొందినప్పటి నుంచి జీపీఎఫ్‌ ప్రయోజనాలు పొందకపోవడం వల్లే తనకు జీతం అందలేదని జస్టిస్‌ మిశ్రా పేర్కొన్నారు. దీంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన్నాడు.

Read Also: Anantapur: అనంతపురం వైద్యుడికి అరుదైన గౌరవం.. అమెరికాలో ఓ వీధికి అతడి పేరు..

ఇక, హైకోర్టు న్యాయమూర్తుల (జీతాలు, సేవా షరతులు) చట్టం, 1954 ప్రకారం తాను కూడా జీపీఎఫ్ ఖాతాకు అర్హుడని జస్టిస్ మిశ్రా పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టును కోరారు. ఇక్కడ, జస్టిస్ మిశ్రా తరపున న్యాయవాది ప్రేమ్ ప్రకాష్ కోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉపశమనం కోరారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఇదే కాకుండా, పాట్నా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి కూడా సమాధానం కోరింది. ప్రస్తుతం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ జనవరి 29న విచారణ చేపడతామని తెలిపింది.