బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు.. ఆ తర్వాత బయటకు వచ్చాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడనే సందేహం చాలామందికి వస్తుంది.. తాజాగా ప్రశాంత్ మాట నిలబెట్టుకున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా ఫెమస్ అయ్యాడు.. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవాడు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు. తల్లికి సాయం చేస్తూ ఇల్లు వాకిలి ఊడుస్తున్న ఆ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.అయితే బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ కధ మారిపోయింది. బిగ్ బాస్ గా విన్నర్ అయిన ప్రశాంత్ ఇప్పుడు అతని కి వచ్చిన క్రేజ్ కారణంగా గొప్పగా ఉండాలని అనుకోలేదు.. ఎటువంటి గర్వం లేకుండా మామూలుగానే ఉన్నాడు..
పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన సమయంలో 35 లక్షలను రైతులు ఇస్తానని చెప్పాడు ఆ మాటను ఊరికే అన్నాడు.. మూడు నెలలు అయిన కూడా ఆ మాటను ఎక్కడా ప్రస్థావించలేదని చాలా మంది అనుకున్నారు.. ఈ వార్తలకు చెక్ పెట్టాడు పల్లవి ప్రశాంత్.. గజ్వేల్లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..