Jharkhand : కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష లో సృహ తప్పిన 25 మంది అభ్యర్థులు, ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని పాలములో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో 25 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ సందర్భంగా స్పృహతప్పి పడిపోయారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ముగ్గురు అభ్యర్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రకారం, 25 మంది అభ్యర్థులు పాలము జిల్లాలోని మేదినీనగర్లోని మేదినిరాయ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారని, వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించారని, రాంచీలోని రిమ్స్లో ఒకరు మరణించారని చెప్పారు.
Read Also:Helicopter Crash: కేదార్నాథ్లో కూలిపోయిన హెలికాప్టర్..
Also Read
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
- Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
వీరంతా ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కే రంజన్ తెలిపారు. వీరికి స్టామినా పెంచేందుకు మత్తు మందు ఇచ్చారని కూడా అనుమానిస్తున్నాం. ప్రస్తుతం మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నాం. మృతుల్లో 20 ఏళ్ల అమ్రేష్ కుమార్, 25 ఏళ్ల అరుణ్ కుమార్, 25 ఏళ్ల ప్రదీప్ కుమార్ ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఉదయం 4:30 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో ఇది ఉదయం 9 గంటలకు జరిగేది. ఈ విషయంపై తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారులను ఆదేశించారు.
Read Also:Jagtial Crime: నా భార్య కత్తితో దాడి చేసింది.. నేను కాదంటున్న భార్య..
పాలము జిల్లాలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో రేసులో పాల్గొని దేహదారుఢ్య పరీక్ష రాసిన సుమారు 100 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు అపస్మారక స్థితికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 9 వరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గిరిదిహ్ జిల్లాలో కూడా ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇక్కడ సుమిత్ అనే యువకుడు అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు మరియు అతన్ని సదర్ హాస్పిటల్ గిరిడిహ్లోని ఐసియులో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి, సీఎం హేమంత్ సోరెన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా గిరిడిహ్ డీసీని తక్షణమే గుర్తించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!