Jharkhand : కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష లో సృహ తప్పిన 25 మంది అభ్యర్థులు, ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లోని పాలములో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో 25 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్ సందర్భంగా స్పృహతప్పి పడిపోయారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ముగ్గురు అభ్యర్థులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రకారం, 25 మంది అభ్యర్థులు పాలము జిల్లాలోని మేదినీనగర్లోని మేదినిరాయ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారని, వారిలో ఇద్దరు అభ్యర్థులు మరణించారని, రాంచీలోని రిమ్స్లో ఒకరు మరణించారని చెప్పారు.
Read Also:Helicopter Crash: కేదార్నాథ్లో కూలిపోయిన హెలికాప్టర్..
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
వీరంతా ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్కే రంజన్ తెలిపారు. వీరికి స్టామినా పెంచేందుకు మత్తు మందు ఇచ్చారని కూడా అనుమానిస్తున్నాం. ప్రస్తుతం మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నాం. మృతుల్లో 20 ఏళ్ల అమ్రేష్ కుమార్, 25 ఏళ్ల అరుణ్ కుమార్, 25 ఏళ్ల ప్రదీప్ కుమార్ ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఉదయం 4:30 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గతంలో ఇది ఉదయం 9 గంటలకు జరిగేది. ఈ విషయంపై తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారులను ఆదేశించారు.
Read Also:Jagtial Crime: నా భార్య కత్తితో దాడి చేసింది.. నేను కాదంటున్న భార్య..
పాలము జిల్లాలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో రేసులో పాల్గొని దేహదారుఢ్య పరీక్ష రాసిన సుమారు 100 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు అపస్మారక స్థితికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 9 వరకు రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గిరిదిహ్ జిల్లాలో కూడా ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఇక్కడ సుమిత్ అనే యువకుడు అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు మరియు అతన్ని సదర్ హాస్పిటల్ గిరిడిహ్లోని ఐసియులో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి, సీఎం హేమంత్ సోరెన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా గిరిడిహ్ డీసీని తక్షణమే గుర్తించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..