NTV Telugu Site icon

Paarijatha Parvam: ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్‘ దూసుకుపోతున్న పారిజాత పర్వం ట్రైలర్..!

5.

5.

‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫై చేస్తూ.. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘పారిజాత పర్వం’. ఇదివరకే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మూవీ మేకర్స్ సినిమా ట్రైలర్ తో ముందుకు వచ్చారు. ఇక ఈ ట్రైలర్ ని స్టార్ యాంకర్ సుమ కనకాల లాంచ్ చేసింది.

”కేక్ కట్ చేసే సమయంలో లైట్స్ అర్పుతారట., మళ్ళీ లైట్స్ వెలిగేలోపు కేక్ తో పాటు వాళ్ళ ఆవిడ కూడా మన బండిలో వుండాలి’ అంటూ ఉన్న కిడ్నాప్ ప్లాన్ ని సునీల్ తన గ్యాంగ్ తో చెబుతుండగా ట్రైలర్ మొదలై ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు హిలేరియస్ గా వున్నాయి. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అల్ మిక్స్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఎంతగానో అలరించింది. ఇక ట్రైలర్ చివర్లో మాత్రం వైవా హర్ష చెప్పిన సినిమా రివ్యూ హెలైట్ గా వుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో.. సినిమా ట్రైలర్ 48 గంటలు దాటినా అయినా సరే ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ సినిమాకి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన హిలేరియస్ కిడ్నాప్ డ్రామాని ప్రేక్షకులకు అందించబోతున్నారని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్ధమౌతుంది. విడుదలైన ట్రైలర్ లో వినిపించిన పాట, అలాగే నేపధ్య సంగీతం కాస్త ప్రేక్షకులకి క్యాచిగా ఉంటూ ఫన్ ని మరింతగా ఎలివేట్ చేస్తుంది. బాల సరస్వతి ఈ సినిమాకి కెమరామెన్ పనితనం అమోగం. సశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా, ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా, అనంత సాయి సహా నిర్మాతగా సినిమా తెరకెక్కనుంది.