OTP Scam: సైబర్ అలర్ట్.. ఒక్కసారి చెప్పారో బ్యాంకు ఖాతా ఖాళీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTP Scam: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో OTP (వన్టైమ్ పాస్వర్డ్) మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ కాల్స్, SMS, వాట్సాప్ సందేశాలు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఫిషింగ్ వెబ్సైట్ల ద్వారా మోసగాళ్లు పౌరుల OTPలను తెలుసుకుని బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లు, ఈ-కామర్స్ యాప్లు ఇంకా వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నారని తెలిపారు. ఒక్కసారి OTP చేతికి చిక్కితే భారీ ఆర్థిక నష్టం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Vijayawada: భవానిపురంలో కారు బీభత్సం.. నిందితులు అరెస్ట్, పరారీలో మరోకారు..!
Also Read
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
సైబర్ నేరస్తులు బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ KYC అప్డేట్ కాల్స్ చేసి, ఖాతా లేదా కార్డు బ్లాక్ అవుతుందని భయపెట్టి OTP కోరడం చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ షాపింగ్ రీఫండ్, క్యాష్బ్యాక్, గిఫ్ట్ వౌచర్లు, రివార్డ్ పాయింట్ల పేరుతో OTP అడుగుతున్నారు. గూగుల్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసినప్పుడు నకిలీ నంబర్ల ద్వారా కాల్ ఎత్తి వెరిఫికేషన్ పేరుతో OTP తీసుకుంటున్నారు.
ఉద్యోగం లేదా లోన్ వెంటనే ఇస్తామని చెప్పి OTP అడగడం, నకిలీ UPI కలెక్ట్ రిక్వెస్ట్ పంపి “డబ్బు జమ అవుతుంది” అంటూ ఆమోదించమని చెప్పి ఖాతా నుంచి డబ్బు డెబిట్ చేయడం వంటి మోసాలు పెరుగుతున్నాయి. SIM స్వాప్ మోసాల ద్వారా డూప్లికేట్ సిమ్ తీసుకుని బ్యాంకింగ్ మెసేజ్లు, OTPలను తమ నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ-కామర్స్ డెలివరీ బాయ్ లేదా మార్కెట్ప్లేస్ ఏజెంట్గా నటించి రిటర్న్ లేదా రిఫండ్ పేరుతో OTP కోరడం మరో పద్ధతి.
ఏ బ్యాంక్, ప్రభుత్వం, ఈ-కామర్స్ సంస్థ, వాలెట్ లేదా డెలివరీ సర్వీస్ కూడా ఎప్పుడూ OTP అడగదని గుర్తుంచుకోవాలని సైబర్ పోలీసులు సూచించారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లను నమ్మవద్దని, కార్డ్ యాక్టివేషన్, KYC, EMI, లోన్, రివార్డ్ పాయింట్లు, రీఫండ్ పేరుతో OTP అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలని సూచించారు. తెలియని UPI కలెక్ట్ రిక్వెస్ట్ ను ఆమోదించవద్దని, మీ ఖాతాలో డబ్బు జమ అవ్వడానికి OTP అవసరం లేదని స్పష్టం చేశారు. కస్టమర్ కేర్ నంబర్లను అధికారిక వెబ్సైట్ లేదా యాప్లలో మాత్రమే ధృవీకరించుకోవాలని, మెసేజ్ల స్క్రీన్షాట్లు ఎవరికీ పంపవద్దని హెచ్చరించారు.
Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్లో ఉన్నట్లే!
అలాగే సిమ్ లాక్, ఫోన్ స్క్రీన్ లాక్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ వంటి భద్రతా ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే వెంటనే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాజా సైబర్ అవగాహన సమాచారానికి సైబర్ క్రైమ్ హైదరాబాద్ సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఫాలో అవ్వాలని పోలీసులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?