NTV Telugu Site icon

Rajyasabha: రాజ్యసభకు త్రిపుర సీఎం రాజీనామా.. ఖాళీగా మరో సీటు

Tripura Chief Minister Manik Saha

Tripura Chief Minister Manik Saha

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సోమవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలో మరో స్థానం ఖాళీ అయింది. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమోదించడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాణిక్ సాహా రాజీనామా చేసినట్లు… అతని రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించినట్లు పార్లమెంట్ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో త్రిపుర శాసనసభకు ఎన్నికైన తర్వాత సోమవారం రాజీనామా సమర్పించడానికి సాహా రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడును కలిశారు. ఆయన బర్దోవాలి పట్టణ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేసి 6,104 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

Vice President: ఉప రాష్ట్రపతి ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు!

అకస్మాత్తుగా జరిగిన సంఘటనల నేపథ్యంలో బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో సాహాను ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకున్న తర్వాత మే 15న త్రిపుర ముఖ్యమంత్రిగా సాహా ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం రెండు నెలల క్రితమే రాజ్యసభకు ఎన్నికైన మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో త్రిపుర బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. ఎగువ సభకు జరిగిన ఎన్నికల్లో ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆయన ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సాహా 2016లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2020లో రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమితులైన ఆయన ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.వచ్చే ఏడాది మార్చిలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది