Site icon NTV Telugu

Vandhe Bharat Train : వందే భారత్​ ఎక్స్​ప్రెస్ రైలు ఢీకొని జింక.. అది మీద పడి ఓ మనిషి మృతి

Vandy Bharath

Vandy Bharath

Vande Bharat Train : రాజస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. వందే భారత్​ ఎక్స్​ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతోపాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్ లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది. వందే భారత్ రైలు వేగంగా వెళ్తూ పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివదయాల్ గా గుర్తించి అతడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Read Also: Bandi sanjay: నా గురువు కేసీఆర్‌ యే..! ఎందుకంటే?

యాక్సిడెంట్ జరిగిన వెంటనే రైలును కాసేపు ఆపేశారు. ప్రమాదానికి కారణమైన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ రైలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజస్థాన్​లోని అజ్మీర్​కు వెళ్తోంది. జింక మీద పడి చనిపోయిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్​గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో జింకతో పాటు శివదయాళ్​కూడా అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. శివదయాల్ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది నవంబరులో.. గుజరాత్​లోని ఆనంద్​ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Exit mobile version