Off The Record: ఏపీ బీజేపీలో కొత్త అలజడి మొదలైందా? పదవి కోసం పావులు కదుపుతున్నారా?
- వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో 4 సీట్లు ఖాళీ..
- బీజేపీకి ఒక ఎమ్మెల్సీ సీటు దక్కుతుందన్న లెక్కలు..
- బలపడే అవకాశాన్ని వదులుకోవద్దన్న టార్గెట్..
- కులాల లెక్కలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయా?..
- మళ్ళీ కాపులకేనా? మరో సామాజికవర్గానికి ఇస్తారా?..
- కేబినెట్ బెర్త్ ఆశలతో కొందరి ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో… రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఇప్పుడు కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే కోటాలో కాపులకు ఇచ్చి ఉన్నందున ఈసారి కూడా అదే సామాజిక వర్గానికి ఇస్తారా? లేక లెక్కలు మారతాయా అన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. రాష్ట్రంలో తాము బలపడటానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటున్నారట ఏపీ కమలనాథులు. అందుకే ఎంపిక ఆచితూచి ఉంటుందని అంటున్నారు. ఆ కోణంలో చూస్తే… కులాల లెక్కలే ప్రధాన పాత్ర పోషించవచ్చన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన కాపు సామాజికవర్గ నేతలు సైతం ట్రయల్స్లో ఉన్నట్టు సమాచారం. కానీ… అధిష్టానం మాత్రం మళ్లీ కాపులకే ఇస్తే…. పుంజుకుంటామా? లేక మరో సామాజికవర్గాన్ని దగ్గరకు తీస్తే… సెట్ అవుతుందా అని లెక్కలేసుకుంటోందట.
మరోవైపు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కించుకుని లక్కు కలిసొస్తే… కొన్నాళ్ళ తర్వాతైనా కేబినెట్లో బెర్త్ దక్కించుకుందామని దూరపు ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. దీంతో కాంపిటీషన్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని వాళ్ళు మాకేంటి అంటూ…పార్టీ పెద్దల మీద వత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది ఒక్క సీటు… అదీకూడా మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే. కానీ… ఇటు చూస్తే… ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఏం జరగబోతోందంటూ… ఉత్కంఠగా చూస్తున్నాయి ఏపీ కాషాయ శ్రేణులు. విషయం తక్కువ, ఉత్సాహవంతులు ఎక్కువ అన్నట్టుగా మా పార్టీలో పరిస్థితి ఉందంటూ… తమకు తామే సెటైర్స్ వేసుకుంటున్నారట ఏపీ బీజేపీ కార్యకర్తలు. చివరికి ఎవరి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో…. ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు మీద టిక్ పెడతారో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..