Odisha: ఇలా ఉన్నారేంట్రా..! నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ వేసిన క్లాస్మేట్స్..!
Odisha School Horror: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ పాఠశాలలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ విద్యార్థుల కళ్ళు మూసుకుపోయాయి. గమనించిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెబాశ్రమ్ పాఠశాల హాస్టల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు.
READ MORE: Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
స్థానికుల సమాచారం ప్రకారం.. కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్లోని సలాగూడలో సేవాశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ, శుక్రవారం రాత్రి విద్యార్థులు హాస్టల్లో నిద్రిస్తున్నారు. కొంతమంది క్లాస్మేట్స్ 8 మంది విద్యార్థుల కళ్ళపై ఫెవిక్విక్ వేశారు. దీంతో కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది బాధిత విద్యార్థులను గోచ్చపాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఫుల్బాని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. శనివారం నాటికి ఒక విద్యార్థి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మరో ఏడుగురు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
READ MORE: Anakapalli: ప్రేమ పరువు హత్య..? లవర్, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన యువకుడు.. అంతలోనే..
జిగురు వల్ల కళ్ళకు నష్టం వాటిల్లిందని వైద్యులు చెబుతున్నారు. అయితే, సకాలంలో చికిత్స అందించడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గిందని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత, జిల్లా యంత్రాంగం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును తక్షణమే సస్పెండ్ చేసింది. విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ ఎందుకు వేశారో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కంధమాల్ సంక్షేమ అధికారి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో వివరణ తీసుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్ సూచనల మేరకు దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!