Odisha: ఇలా ఉన్నారేంట్రా..! నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ వేసిన క్లాస్మేట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha School Horror: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ పాఠశాలలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్ళలో తోటి విద్యార్థులు ఫెవిక్విక్ పోశారు. దీంతో ఆ విద్యార్థుల కళ్ళు మూసుకుపోయాయి. గమనించిన ఉపాధ్యాయులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన సెబాశ్రమ్ పాఠశాల హాస్టల్లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ అంశంపై కలెక్టర్ సైతం జోక్యం చేసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు.
READ MORE: Panic Attack: అలర్ట్.. పానిక్ అటాక్ ఎంటో తెలుసా… మీకు ఈ లక్షణాలు ఉన్నాయా!
Also Read
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
స్థానికుల సమాచారం ప్రకారం.. కంధమాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్లోని సలాగూడలో సేవాశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ, శుక్రవారం రాత్రి విద్యార్థులు హాస్టల్లో నిద్రిస్తున్నారు. కొంతమంది క్లాస్మేట్స్ 8 మంది విద్యార్థుల కళ్ళపై ఫెవిక్విక్ వేశారు. దీంతో కళ్ళు గట్టిగా మూసుకుపోయాయి. ఇది గమనించిన హాస్టల్ సిబ్బంది బాధిత విద్యార్థులను గోచ్చపాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఫుల్బాని జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి తరలించారు. శనివారం నాటికి ఒక విద్యార్థి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మరో ఏడుగురు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు.
READ MORE: Anakapalli: ప్రేమ పరువు హత్య..? లవర్, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన యువకుడు.. అంతలోనే..
జిగురు వల్ల కళ్ళకు నష్టం వాటిల్లిందని వైద్యులు చెబుతున్నారు. అయితే, సకాలంలో చికిత్స అందించడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గిందని వెల్లడించారు. ఈ ఘటన తర్వాత, జిల్లా యంత్రాంగం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును తక్షణమే సస్పెండ్ చేసింది. విద్యార్థుల కళ్ళలో ఫెవిక్విక్ ఎందుకు వేశారో తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి కంధమాల్ సంక్షేమ అధికారి ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి విద్యార్థులతో వివరణ తీసుకున్నారు. ప్రస్తుతం కలెక్టర్ సూచనల మేరకు దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?