అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు.. ఈ వేడుకను కన్నులార చూడటానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు పలు ఇండస్ట్రీల ప్రముఖులు పెద్దెత్తున తరలివచ్చారు.. ఆహ్వానం అందుకున్న ప్రతి స్టార్ హీరో అయోధ్య కు వెళ్లారు.. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ తోపాటు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరుకాలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం ముఖ్యమైన సీన్ షూటింగ్ ఉందట… ఆ షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆయన ఆ కార్యక్రమానికి రాలేక పోయడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండస్ట్రీలో ఇదే పెద్ద టాపిక్ అయ్యింది..
నిజానికి దేవరలో సైఫ్ అలీఖాన్ తో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాల్సి ఉండటంతో నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని తారక్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సైఫ్ అలీఖాన్ గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం, ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి రావడం చివరి నిమిషంలో తారక్ అయోధ్య ట్రిప్ రద్దు చేసుకున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు.. ఈ విషయం పై ఎన్టీఆర్ ఇంకా స్పందించలేదు..