Puja Khedkar : పూజా ఖేడ్కర్ కేసులో దర్యాప్తు వేగవంతం.. వారం చివర్లో నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puja Khedkar : ఫేక్ సర్టిఫికెట్లతో అధికారిణిగా మారిన ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు కష్టాలు పెరుగుతున్నాయి. పూజా ఖేద్కర్పై మోసం ఆరోపణలపై UPSAC ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పూజా ఖేద్కర్కు సమన్లు పంపనున్నారు. ఈ వారం చివరిలోగా ఆమెకు నోటీసులు పంపనున్నారు. ఆమెను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం వారు పూజా ఖేద్కర్ పత్రాలను చూడాలనుకుంటున్నారు. వాటి గురించి దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Read Also:Nithin : వెబ్ సీరిస్ దర్శకుడితో నితిన్..ఎవరా దర్శకుడు.?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
వికలాంగుల కోటా, ఓబీసీ రిజర్వేషన్ దుర్వినియోగం ఆరోపణలపై జూలై 19న ఢిల్లీ పోలీసులు పూజా ఖేడ్కర్పై కేసు నమోదు చేశారు. అంతే కాదు పరిమితికి మించి అవకాశాలు దక్కించుకునేందుకు పత్రాలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పూజా ఖేడ్కర్ కూడా ఐఏఎస్ కావడానికి తన గుర్తింపును మార్చుకున్నట్లు యూపీఎస్సీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పూజా తన పేరు మార్చుకుందని ఆరోపణలు వచ్చాయి. తండ్రి, తల్లి పేర్లను కూడా మార్చారు. ఈ మొత్తం కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ నిర్వహించింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను క్రైమ్ బ్రాంచ్లో భాగమైన ఏసీపీకి అప్పగించారు.
Read Also:Anjali: బోల్డ్ సీన్స్ అలానే చేశా..అంజలి షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పూజా ఖేడ్కర్కు సంబంధించిన పత్రాలను వెలికితీసి వాటిని పరిశీలించడంపై క్రైం బ్రాంచ్ దృష్టి సారించింది. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత, బృందం పూజా ఖేడ్కర్కు నోటీసు పంపుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పూజా ఖేడ్కర్కు డాక్యుమెంట్లు చూపించి అక్రమాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. పూజా ఖేడ్కర్పై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 464, సెక్షన్ 465, సెక్షన్ 471 కింద కేసు నమోదు చేశారు. పూజా ఖేడ్కర్ 2023 బ్యాచ్కి చెందిన ఐఏఎస్, ప్రస్తుతం ఆమె ట్రైనీగా ఉన్నారు. పూజా ఖేడ్కర్ను మహారాష్ట్రలోని పూణేకు ట్రైనీగా పంపారు. కానీ వివాదాల్లో చిక్కుకుని వాసిమ్ కి బదిలీ చేయబడింది. ఇది మాత్రమే కాదు, వివాదం ముదరడంతో ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీకి తిరిగి పిలిచారు. పూజా ఖేద్కర్ ఒక అధికారిగా తనకు లభించని అనేక విషయాలను డిమాండ్ చేసిందని ఆరోపణ. ఓబీసీ క్రీమీలేయర్ యేతర రిజర్వేషన్ను దుర్వినియోగం చేశారని పూజా ఖేడ్కర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వికలాంగుల కోటాను కూడా దుర్వినియోగం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!