Site icon NTV Telugu

US-North Korea: ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు.. అమెరికాకు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్

Kim Jong Un

Kim Jong Un

US-North Korea: అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొత్త వ్యూహాన్ని అనుసరించారు. అమెరికా ఎత్తుగడలను అడ్డుకునేందుకు యుద్ధ సన్నాహాలను పెంచాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు. అమెరికా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర కొరియా-2024 వ్యూహంపై జరిగిన సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు… ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఆధునీకరించడానికి ఆయుధ పరీక్షలను కొనసాగిస్తుందని సూచిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఉత్తర కొరియా వ్యూహంపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు.

Read Also: Ayodhya New Airport : అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా?

బుధవారం కిమ్ జోంగ్ పార్టీ పూర్తి సమావేశంలో ఉత్తర కొరియాపై చర్యలు తీసుకోవద్దని అమెరికా, దాని మిత్రదేశాలను హెచ్చరించారు. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేయాలని కిమ్ జోంగ్ తన సైన్యానికి పిలుపునిచ్చారు. ఇక్కడ, ఏప్రిల్‌లో జరిగే దక్షిణ కొరియా పార్లమెంటరీ ఎన్నికలు, నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా సైనిక కవ్వింపులు, సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని దక్షిణ కొరియా గూఢచారి సంస్థ గురువారం తెలిపింది.ఉత్తర కొరియా ఇటీవల కొన్ని ప్రధాన కవ్వింపు చర్యలకు పాల్పడిన పలువురిని ఉన్నత స్థానాల్లో నియమించిందని నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పేర్కొంది. ఉత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలు నిర్వహించిందని తెలిపారు.

Exit mobile version