Nirmala Sitaraman: నిర్మలమ్మ చమ్మక్కులు.. నవ్వుకున్న సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitaraman: ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు. దీంతో లోక్సభలో నవ్వులు పూశాయి. వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ఆమె ప్రకటన చేస్తూ .. పాత కలుషిత వాహనాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో ఓల్డ్ పొల్యూటింగ్ కు బదులుగా .. ఓల్డ్ పొలిటికల్ అని పలికారు. ఆ తర్వాత వెంటనే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. అయితే పొల్యూటింగ్ పదం స్థానంలో పొలిటికల్ అని మంత్రి పలకడంతో సభ్యులు నవ్వేశారు. వెహికిల్ రిప్లేస్మెంట్ పాలసీ అతిముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికిన ఆమె తన పొరపాటును గుర్తించి చిరునవ్వు నవ్వారు. ఇక పొలిటికల్ పదం వాడిన సందర్భంలో పలుమార్లు పొల్యూటింగ్ పదాన్ని వినిపించారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని చేపడుతున్నట్లు ఆమె చెప్పారు.
MPs laugh as FM Nirmala Sitharaman slips up, says ‘political’ instead of ‘polluting’. #Budget2023 #BudgetWithEJ
Also Read
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
Read: https://t.co/Bp1CoWd5xA pic.twitter.com/m2YwwFpg4O
— editorji (@editorji) February 1, 2023
ఇప్పటికే సీఎంలకు లేఖలు :
15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న అన్ని రకాల వాహనాలను నిషేధిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖ బస్సులు, ఆర్టీసీ, ఇతర వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కారణంగా పాత వాహనాలను తక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన పాలసీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించడంతో పాటు ప్రతీ రాష్ట్ర్రంలోనూ వెహికిల్ స్క్రాపేజి పాలసీని రూపొందించి అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
తాజావార్తలు
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!